గతంలో తెలుగు సినిమాలను, తమిళ సినిమాలను బాలీవుడ్ వారు తక్కువ అంచనా వేసే వారు.సౌత్ సినిమాలంటే చిన్న చూపు చూసేవారు.
కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కంటెంట్ ఉండదు అంటూ సౌత్ సినిమాలపై గతంలో ఉత్తరాదిన విమర్శలుండేవి.కాని ఇప్పుడు ఆ ఆలోచన దోరణిని బాలీవుడ్ వారు తొలగించారు.
బాలీవుడ్లో కంటే కూడా అధికంగా క్వాలిటీ మరియు కంటెంట్తో తెలుగు తమిళ చిత్రాలు తెరకెక్కుతున్నాయని వారు ఒప్పుకుంటున్నారు.
సౌత్ దర్శకులు రాజమౌళి, శంకర్, మురుగదాస్, మణిరత్నం వంటి దిగ్గజ దర్శకులు మన సినిమాను బాలీవుడ్ రేంజ్లో పెట్టారు.రోబో, బాహుబలి, 2.ఓ చిత్రాలు బాలీవుడ్ స్థాయిని దాటాయి.ఈ సమయంలోనే సౌత్లో వచ్చిన సినిమాలు హిందీలో కూడా రీమేక్ అవుతున్నాయి.ఈమద్య కాలంలో తరచుగా సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
కొన్ని నెలల క్రితమే తెలుగు టెంపర్ చిత్రం హిందీలో రీమేక్ అయ్యి 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది.
ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రం కూడా హిందీలో రీమేక్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి.మొదటి రోజు రివ్యూవర్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికి కేవలం అయిదు రోజుల్లోనే 100 కోట్లను దక్కించుకుని ఇప్పుడు రెండువందల కోట్ల మైళు రాయిని కూడా చేరింది.లాంగ్ రన్లో 250 కోట్ల వరకు ఈ చిత్రం వెళ్తుందని అంతా భావిస్తున్నారు.
ఇంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కబీర్ సింగ్ కు తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.కబీర్ సింగ్ విజయంతో మరోసారి తెలుగు వారి సత్తా, తెలుగు వారి సినిమా స్థాయి బాలీవుడ్ వారికి తెలిసి ఉంటుంది.