విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి.ఈ సినిమా తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇక ఈ సినిమాతో అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరు టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు.ఇక విజయ్ దేవరకొండ అదే ఇమేజ్ ని కొనసాగిస్తూ ఏకంగా వంద కోట్ల హీరోగా మారిపోయాడు.
అతని సినిమా అంటే గ్యారెంటీ కలెక్షన్స్ అనే విధంగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లోకి వెళ్ళిపోయాడు.
అక్కడ కబీర్ సింగ్ పేరుతో సాహిద్ కపూర్ హీరోగా సినిమాని తెరకెక్కించి మొదటి సినిమాతో వంద కోట్ల దర్శకుడుగా మారిపోయాడు.ఇక ఇప్పుడు హిందీలో రెండో సినిమాకి సందీప్ రెడీ అయిపోతున్నాడు.
కబీర్ సింగ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు సినిమాలనే బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ ని వివాదాలు చుట్టూ ముట్టాయి.
చాలా మంది ప్రముఖులు సినిమా గురించి కామెంట్స్ చేశారు.ఇక హీరోయిన్స్ కూడా సినిమాలో హీరో, హీరోయిన్స్ రొమాన్స్ మీద కామెంట్స్ చేశారు.
దీంతో ఈ సినిమా ఈ ఏడాది మోస్ట్ ట్రెండింగ్ మూవీగా మారిపోయింది.గూగుల్ లో ఎక్కువ మంది ఈ సినిమా గురించి వెతికి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.
అది ఎంతగా అంటే హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా కబీర్ సింగ్ ముందు చిన్న బోయింది.గూగుల్ లో 2019 సంవత్సరం ట్రెండ్స్ జాబితాను విడుదల చేయగా అందులో అవెంజర్స్ ను పక్కకు నెట్టి కబీర్ సింగ్ నెం.1 గా నిలిచింది.ఈ సినిమాని గూగుల్ ఎక్కువ మంది వెతికినా చిత్రాల జాబితాలో హాలీవుడ్ సినిమాలని సైతం పక్కన పెట్టి కబీర్ సింగ్ టాప్ లోకి వచ్చింది.