సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి ఎట్టకేలకు చిక్కుముడులన్ని విప్పుకోని విడుదలకు సిద్ధమైంది.ఈరోజే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, యూ సర్టిఫికేట్ సంపాదించుకుంది.
ఇన్నిరోజులుగా ఫైనాన్సియల్ సమస్యలతో విడుదల మాటిమాటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.జులై మొదటివారంలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం, జులై 15కి వాయిదా పడ్డట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఇక జులై 22న ఈ సినిమాను బాక్సాఫీస్ బరిలో దింపుతున్నట్లు ప్రకటించినా, రజినీ అభిమానుల్లో ఎక్కడో అనుమానం.సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమో అని.కాని అనుమానాలన్నిటికి తెర దించుతూ, సినిమా విడుదలను ప్రకటించారు మేకర్స్.కబాలి ముందు ప్రకటించినట్టుగానే జులై 22 ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.
తెలుగులో కూడా ఈ సినిమాపై భారి అంచనాలున్నాయి.షణ్ముఖ ఫిలిమ్స్ 30 కోట్లకు పైగా చెల్లించి చిత్ర హక్కులను దక్కించుకోవడం విశేషం.
రాధిక ఆప్టే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు.సంతోష్ నారాయణణ్ సంగీతాన్ని అందించగా జి.మురళీ కెమెరా బాధ్యతలు చూసుకున్నారు.ఇక వి.క్రియేషన్స్ పతాకంపై భారి బడ్జెట్తో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.