కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జీఏ2 లో బన్నీ వాసు నిర్మించిన చావు కబురు చల్లగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే ఇప్పటికే అర్థం అయ్యింది.
సినిమా లో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో పాటు చక్కని మెసేజ్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.సినిమా విడుదలకు రెండు వారాలు ఉండగానే ప్రచారంతో దుమ్ము రేపుతున్నారు.
హీరో కార్తికేయ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు ఫుల్ గా తిరిగేస్తున్నారు.ఇలాంటి సమయంలో సినిమా భారీ ఎత్తున బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
అయిదు కోట్ల లోపు బడ్జెట్ తోనే ఈ సినిమాను పూర్తి చేసి ఉంటారని అంటున్నారు.అలాంటిది ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల వరకు బిజినెస్ చేసిందని అంటున్నారు.
నైజాం.సీడెడ్.
ఆంద్రా ఇలా ప్రతి ప్రాంతంలో కూడా భారీగానే ఈ సినిమా బిజినెస్ చేసింది.పెద్ద మొత్తంలో ఈ సినిమా అమ్మడు పోయిన నేపథ్యంలో చిత్ర నిర్మాత విడుదలకు ముందే లాభాలను దక్కించుకున్నాడు.
నిర్మాత ఇప్పటికే సేఫ్ అయ్యాడు కాని కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.ఈ సినిమా బయ్యర్లకు లాభాలను తెచ్చి పెట్టాలంటే దాదాపుగా 14 కోట్లు వసూళ్లు సాధించాల్సి ఉంది.14 కోట్ల వరకు వసూళ్లు సాధించగా ఆ పై వచ్చేవి బయ్యర్లకు లాభాలను తెచ్చి పెడతాయి.మరి అంత భారీగానే ఈ సినిమా ను రాబడుతుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా పై ఉన్న హైప్ నేపథ్యంలో భారీ బిజినెస్ రాబట్టింది.ఇక కాస్త పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా మరో లెవల్ లో సినిమాను రాబట్టడం ఖాయం అంటున్నారు.
ఈజీగా పాతిక కోట్ల వరకు రాబడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అందుకే ఈ సినిమా ను ఆ రేంజ్ లో కొనుగోలు చేశారట.మరి బయ్యర్ల అంచనా ఎంత వరకు నిజం అయ్యేనో చూడాలి.