ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాను చూసి సెలబ్రిటీలంతా సినిమా గురించి పాజిటివ్ గానే వెల్లడించారు.అయితే ప్రముఖ రాజకీయ నేతలలో ఒకరైన కేఏ పాల్ మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ మూవీని ఒక్క నిమిషం కూడా చూడలేకపోయానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.సినిమాల గురించి కేఏ పాల్ మాట్లాడుతూ నేను సినిమాలను పెద్దగా చూడనని తెలిపారు.
ఇంట్లో ఉన్న సమయంలో పిల్లలు టీవీ పెడితే ఆ సమయంలో అక్కడ చూసి వెళ్లిపోతానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.నాకు సినిమాలు చూడాలని అనిపించదని సినిమాలపై పెద్ద ఆసక్తి ఉండదని కేఏ పాల్ తెలిపారు.
ఈ మధ్య కాలంలో చూసిన సినిమా ఆర్ఆర్ఆర్ అని టీవీలో పిల్లలు పెట్టగా ఆ సినిమాను చూశానని కేఏ పాల్ పేర్కొన్నారు.
ఒక నిమిషం కూడా తాను ఆ సినిమాను చూసి ఉండనని కేఎల్ పాల్ చెప్పుకొచ్చారు.సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కేఏ పాల్ మాట్లాడుతూ సోషల్ మీడియా ట్రోలింగ్ నిజమే కావచ్చని తెలిపారు.ఆర్ఆర్ఆర్ గురించి కేఏ పాల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేఏ పాల్ కొన్ని విషయాల్లో ట్రోల్ అయినా ఆయనను అభిమానించే అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.మత ప్రచారంలో బిజీగా ఉండటంతో పాటు ఎన్నికలకు ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో కేఏ పాల్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది.కేఏ పాల్ ఆర్ఆర్ఆర్ విషయంలో చేసిన కామెంట్లు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ను మాత్రం హర్ట్ చేస్తున్నాయి.