క్రైస్తవ మత బోధకుడిగా … ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డాక్టర్ కేఏ పాల్ గురించి అందరికి తెలిసి కదా.ఆయన పుట్టి పెరిగింది అంతా ఏపీలోనే.
ఆయన పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.ప్రపంచ శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని ఏకం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని చెబుతుంటారు.
కానీ పాల్ ఇలా చెబుతుంటే అందరూ ఆ మాటలను కామెడీ గా తీసుకుని నవ్వుకుంటారు కానీ… కేఏ పాల్ కు అంత సీన్ అప్పట్లో ఉండేది.పాల్ కోసం ఒకప్పుడు ప్రపంచ దేశాల అధ్యక్షులు క్యూ కట్టిన రోజులు కూడా ఉన్నాయి.
కానీ తరువాత రోజులలో కేఏ పాల్ హవా తగ్గిపోయి .ఆయన్ను .ఆయన మాటలను కామెడీ గా తీసుకుంటున్నారు.
తాజాగా ఆయన రాజకీయ వ్యాఖ్యలు అందరికి ఆసక్తి కలిగిస్తున్నాయి.ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే నిధుల వరద పారిస్తామని పాల్ చెబుతున్నాడు.సంవత్సరానికి ఇంత అప్పులు చేస్తున్న వాళ్లు.
రాబడి లేనప్పుడు ఆ అప్పులు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ.
రాబడి రావాలంటే పెట్టుబడులు, డొనేషన్లు కావాలన్నారు.గతంలో తాను 200 దేశాల నుంచి 2045 మందితో బిజినెస్ కాన్ఫరెన్సులు పెట్టానని.
ఇప్పుడు అలాగే సదస్సులు పెట్టి డొనేషన్లు రాబడతానన్నారు.వాటితో రుణాలను తీర్చేస్తానన్నారు.
ఏడు కోట్ల కోట్ల రూపాయలలో ఏడు లక్షల కోట్లు తీసుకొచ్చి.రెండు లక్షల కోట్లతో రుణమాఫీ తీర్చినా.
ఇంకా ఐదు లక్షల కోట్లు మిగులుతాయన్నారు.ఆ డబ్బులతో ఐదేళ్లకు బడ్జెట్ కేటాయింపులు జరుపుతామన్నారు.
ఈ నిరుద్యోగులు, మహిళలు… ఒక్కొక్కరూ వంద, వెయ్యిమందికి చెప్పి.ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటూ పాల్ వేడుకున్నారు.