జగన్ కే వార్నింగ్ ఇస్తున్న కే.ఏ.పాల్..!

2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ లు పోటీపడగా అందులో వైఎస్ఆర్సిపి పార్టీ రికార్డు స్థాయిలో స్థానలను కైవసం చేసుకొని వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నాడు.

 Ka Paul Warns Cm Jagan, Ap Cm Jagan Mohan Reddy, Ap Politics, Ysr Rajashekar Red-TeluguStop.com

ఈ మూడు పార్టీల తో పాటు ఆటలో మిరపకాయ్ అన్నట్లు కే.ఏ.పాల్ సొంతంగా ఓ పార్టీని పెట్టి రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను నిలబెట్టి కనీసం నోటా కన్నా ఎక్కువ ఓట్లను సాధించలేకపోయారు.

అలా ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కే.

ఏ.పాల్ అడ్రస్ లేకుండా పోయాడు.అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ నానా హంగామా చేయడం పరిపాటిగా మారిపోయింది.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కే.ఏ.పాల్ వార్నింగ్ ఇచ్చినట్లు అయింది.తాజాగా కె.ఏ.పాల్ సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తూ వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే నడుస్తున్నాడని అలా వెళ్తే నాశనం అవుతారని జగన్ ను హెచ్చరించాడు.

Telugu Apcm, Ap, Jagan, Ka Paul, Kapaul, Ys Jagan Fans, Ysrrajashekar-Political

ఇలా ఎందుకు చెబుతున్నాను అన్న కారణం తెలియజేస్తూ.తాజాగా ట్రంప్ తనతో పెట్టుకొని ఓడిపోయాడు అని ఆయన చెప్పుకొచ్చారు.వీలైనంత త్వరగా జగన్ వైఖరిలో మార్పు తెచ్చుకొని పరిపాలన చేయాలంటూ కే.ఏ.పాల్ సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు.ఈ వ్యాఖ్యలపై జగన్ అభిమానులకు ఏవిధంగా స్పందిస్తారో త్వరలో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube