హైదరాబాద్ లో కేఏ పాల్ ప్రెస్ మీట్... ఏమి మాట్లాడారంటే

ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ ఈ రొజు ప్రేస్ మీట్ ఏర్పాటు నిర్వహించారు.

 K A Paul Press Meet In Hyderabad-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై దాడి జరిగింది అని, ఈ దాడి జరగడానికి కారణమా బాబుగారే అని పాల్ తెలిపారు.నాకు ప్రాణ హాని ఉందని 2018 అక్టోబర్ లో హైకోర్టు లో దీనిపై కేసు కూడా నమోదు చేసామని, నాకు ప్రాణ హాని ఉందని ఎన్నిసార్లు తెలిపినప్పటికీ నాకు మాత్రం సెక్యూరిటీ కల్పించలేదు అని పాల్ ఆరోపించారు.

అదే రేవంత్ రెడ్డి కి మాత్రం ఒక్క గంటలోనే సెక్యూరిటీ ని కల్పించిన బాబుగారు నాకు మాత్రం సెక్యూరిటీ కల్పించడానికి కుదరలేదు.

అలానే ఏపీ ఎన్నికల గురించి కూడా మాట్లాడారు.

ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత సి ఎం ఎవరన్నది నేనీ డిసైడ్ చేస్తానంటూ పాల్ వ్యాఖ్యానించారు.హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన ఈ నెల 23 న ఏపీ ఫలితాలు వెల్లడవుతాయని ఈ ఫలితాల తరువాత ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

ప్రజాశాంతి పార్టీ కి 100 కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు సర్వేలోనే తేలింది అనికావున ఏపీ సి ఎం ఎవరు అన్నది నేను డిసైడ్ చేస్తాను అని తెలిపారు.అలానే నీచ రాజకీయాలు చేయడం కంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం బెటరని, కేఏ పాల్ నిజాయితీ కి మారుపేరంటూ తనను తానూ పొగుడుకున్నారు.

ఇప్పటికైనా బాబు మనసు మార్చుకుంటే మీ కోసం ప్రేయర్ చేస్తా అంటూ పాల్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube