మలయాళీ లో తెరకెక్కిన దృశ్యం మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సౌత్ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యింది.ఇక ఈ సినిమా తెరకెక్కిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాతోనే దర్శకుడు జీతూ జోసెఫ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే థ్రిల్లర్ సినిమాలని తెరకెక్కించే జీతూ జోసెఫ్ ఇప్పుడు తమిళ, మలయాళీ భాషలలో ద్విభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఇక జీతూ జోసెఫ్ తెరకెక్కించబోయే ఈ ద్విభాషా చిత్రంలో తమిళ హీరోయిన్ జ్యోతిక మెయిల్ లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఆమెతో పాటు జ్యోతిక మరిది తమిళ యంగ్ హీరో కార్తి కూడా ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం.
త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది అని తెలుస్తుంది.జ్యోతిక, కార్తికి తెలుగులో కూడా మార్కెట్ వున్న నేపధ్యంలో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.