డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఛార్మింగ్ ఛార్మి హీరోయిన్గా తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ట్రైలర్స్ మరియు పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమాను ఫ్యామిలీ ప్రేక్షకులు చూడటం కష్టంగా అనిపిస్తోంది.
ఈ సినిమా కేవలం యూత్ ఆడియన్స్ మాత్రమే అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.దాంతో చిత్ర యూనిట్ జాగ్రత్త పడి ఈ సినిమాపై ఒక క్లారిటీని ప్రేక్షకుల్లో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కేవలం యూత్ ఆడియన్స్కు మాత్రమే కాదని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు.తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాక ఒక నిర్మాత కూడా అయినా ఛార్మి మాట్లాడుతూ.
ఈ సినిమాలో ‘జ్యోతిలక్ష్మి’ ఒక వేశ్యే.కాని ఇందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండవని, శృతిమించిన శృంగారం ఈ సినిమాలో ఉండదని చెప్పుకొచ్చింది.
చిన్న పిల్లలతో పాటు కూడా ఈ సినిమా చూడవచ్చని ఈమె చెప్పుకొచ్చింది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ/ఎ’ సర్టిఫికెట్ను ఇచ్చిన విషయాన్ని ఈమె గుర్తు చేస్తోంది.
ఈమె ఎంతగా అరిచి చెప్పినా కాని ఈ సినిమాపై ఆ సినిమా అనే ముద్ర పడటంతో ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కష్టమే.