కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచ మానవాళికి వెన్నులో వణుకు పుట్టక మానదు.కేవలం కొన్ని నెలల కాలంలో లక్షలాది మంది ప్రాణాలు హరించిన ఈ మహమ్మారి.
రోజు రోజుకి తన పరిణామ క్రమాన్ని మార్చుకుంటోంది.కేవలం సామాజిక దూరం పాటిస్తే దరిచేరని కరోనా తరువాతి కాలంలో గాలిలో కూడా వ్యాప్తి చెందేలా మారిపోయింది.
ప్రస్తుతం దీనికి పేద ధనిక, సెలబ్రిటీ లు అనే భేదం లేదు.అదేదో సినిమాలో వార్ వన్ సైడ్ లా అందరిపై మూకుమ్మడిగా దాడి చేస్తోంది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు పెద్ద కుమారడు జూనియర్ ట్రంప్ ప్రేయసిపై కరోనా తన పంజా విసిరింది.
ట్రంప్ పెద్ద కుమారుడైన జూనియర్ ట్రంప్ ప్రేయసి కింబర్లీ గిల్ ఫోయాల్ కి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.
ఆమెకి కరోనా పాజిటివ్ వచ్చిందని అమెరికా మీడియా పేర్కొంది.కింబర్లీ గతంలో ఫ్యాక్స్ టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది.అప్పట్లో ఆమె షో లో ఎంతో పాపులర్ షో లుగా పేరు తెచ్చుకున్నాయి.అయితే గత కొంత కాలంగా ట్రంప్ పెద్ద కుమారుడు ఆమెతో డేటింగ్ లో ఉన్నాడు.
వీరి డేటింగ్ విషయం అప్పట్లో మీడియా కోడై కూసింది కూడా తాజాగా
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం వేడులక సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగాన్ని వినడానికి కింబర్లీ దక్షిణ డకోటా రాష్ట్రానికి వెళ్ళింది.అయితే నిభంధనల ప్రకారం ఆ వేడులకని వీక్షించడానికి ట్రంప్ ని కలిసే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు కింబర్లీ కూడా కరోనా పరీక్షలు చేపట్టడంతో ఆమెకి పాజిటివ్ అని తేలింది.
దాంతో అధికారులు హుటాహుటిన ఆమెని ఐసోలేషన్ వార్దుకు తరలించారు.కానీ ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉందని ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ ప్రకటించింది.
ఈ పరిణామాలతో జూ.ట్రంప్ కి కూడా కరోనా పరీక్షలు నివహించ నున్నారని తెలుస్తోంది.