యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో మాస్ సినిమాల్లో ఎక్కువగా నటించి ఈ మధ్య కాలంలో నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత కూడా వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ లా ఎన్టీఆర్ కు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని ఎన్టిఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ మాస్క్ పెట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఎన్టీఆర్ పెట్టుకున్న మాస్క్ ఖరీదు ఫ్యాన్స్ ను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
రెండు రోజుల క్రితం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఒక ఫంక్షన్ జరగగా ఆ ఫంక్షన్ కు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి హాజరయ్యారు.ఎన్టీఆర్ స్టైలిష్ గా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో యూఏ స్పోర్ట్స్ మాస్క్ తో కనిపించగా ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఈ మాస్క్ ఖరీదు 2,340 రూపాయలు అని తెలుస్తోంది.కరోనా కేసులు తగ్గినా నిర్లక్ష్యం వహిస్తే వైరస్ బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరిస్తున్నారు.గతంలో ఎన్టీఆర్ ధరించిన షూ ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో సందడి చేయనున్నారు.స్టార్ మా ఛానెల్ లో సక్సెస్ అయిన షో కావడంతో జెమినీ టీవీలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ నాగార్జున చేతుల్లోకి వెళితే నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం గమనార్హం.