ఏపీ రాజకీయాల్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై ఇప్పటికే పలువురు స్పందించారు.
ఇక తాజాగా అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.ఏపీ లో ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
అధికార పార్టీ అయినా వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగతంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కామెంట్స్ తర్వాత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యి కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ ఘటనపై టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఘటనపై ఒక వీడియో చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో ద్వారా ఎన్టీఆర్ ఎం మాట్లాడారంటే.
” రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం.కానీ అవి ప్రజల సమస్యల మీద జరగాలి కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సమాజానికి మంచిది కాదు.
నిన్న అసెంబ్లీ లో జరిగిన ఘటన ఎంతగానో కలచి వేసిందని.ఎప్పుడైతే మనం ప్రజల సమస్యలు పక్కన పెట్టి మరి వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతామో అది అరాచక పాలనకు దారి తీస్తుందని ఎన్టీఆర్ తెలిపాడు.
ముఖ్యంగా ఆడవాళ్ళ మీద పురుష పదజాలంతో మాట్లాడడం తప్పని.ఆడపడుచుని గౌరవించాలని.ఇలా సంస్కృతి, సంప్రదాయాలను కాల్చేసి రాబోయే తరానికి ఇదే బంగారు బాట అనుకుని మీరు తప్పు చేస్తున్నారని తారక్ చాలా భావోద్వేగంతో మాట్లాడారు.ఈ మాటలన్నీ ఇంటి సభ్యుడిగా మాట్లాడడం లేదని ఒక తల్లికి కొడుకుగా, ఒక భర్తగా.
తండ్రిగా.దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని.
ఇక్కడితో ఇది ఆపేయాలని ఎన్టీఆర్ తెలిపాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.