కొన్ని నెలల క్రితం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి.టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని మైత్రీ నిర్మాతలు ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్టేనని తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమా తరువాత తారక్ తో ప్రశాంత్ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా ఆ పరిస్థితులు కనిపించడం లేదు.2021 జనవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రశాంత్ నీల్ ను అడిగినా అతని నుంచి సమాధానం రావట్లేదు.
మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఎన్టీఆర్ తో సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు.గత ఐదేళ్ల నుంచి వరుస విజయాలతో క్రేజ్ ను పెంచుకున్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయాలని భావించినా మైత్రీ మూవీ మేకర్స్ సైతం సైలెంట్ గా ఉండటంతో ఈ సినిమా ఆగిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి.
అయితే భవిష్యత్తులో మాత్రం తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని కొరటాల స్నేహితుడు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.