నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుందంటే జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్నంత ఆదరణ నందమూరి హీరోల్లో ఇంకెవరికీ లేదన్నది కాదనలేని సత్యం.
సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో తారక్ ఉండటంతో పాటు ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అచ్చం తాతలాగే నటనలో రాణిస్తున్నాడనే గుర్తింపు తెచ్చుకున్నాడు.టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పొజీషన్లో ఉన్నాడు.
అయితే రాజకీయ పరంగా కూడా అప్పుడప్పుడు తారక్ పేరు వినిపిస్తూనే ఉంది.
ఒకానొక సమయంలో తారక్ టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు.
చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీ తరఫున 2009 ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం దక్కించుకోలేదు.
కానీ సీట్లు మాత్రం 44 నుంచి తొంబై దాకా పెరగడం బాగా కలిసి వచ్చింది.కానీ అధికారం దక్కించుకోలేదు.
అప్పటి నుంచి ఎన్టీఆర్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు.ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు.
అయితే ఈ మధ్య టీడీపీ వరుస ఓటములతో ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది.ఆయన టీడీపీ పగ్గాలు తీసుకోవాలంటూ తమ్ముళ్లు నినాదాల చేస్తున్నారు.
కానీ ఎన్టీఆర్ మాత్రం వాటిపై పెద్దగా స్పందించకుండా మౌనంగానే తన పని తాను చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగామొన్న చంద్రబాబు కన్నీళ్లతో మళ్లీ రాజకీయంగా ఎన్టీఆర్ తెరమీదకు వచ్చారు.
అయితే ఆయన ఎక్కడా రాజకీయంగా మాట్లాడకుండా ఆచీ తూచీ స్పందించారు.తాను కుటుంబ సభ్యుడుగా కాకుండా దేశ పౌరుడిగా బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నానన్నారు.
అయితే ఈ స్పందన అందరినీ మెప్పించినా టీడీపీకి మాత్రం మింగుడు పడట్లేదు.ఎన్టీఆర్ చంద్రబాబుకు సపోర్టుగా మాట్లాడుతారని అనుకున్న సమయంలో అలా కాకుండా మామూలుగా మాట్లాడేశారు.
దీన్ని బట్టి ఎన్టీఆర్ ప్రస్తుతానికి టీడీపీకి దూరాన్ని పాటిస్తున్నారని అర్థం అయిపోయింది.తన మాటల్లో ఎక్కడా టీడీపీ పేరు గానీ, చంద్రబాబు పేరుగానీ ప్రస్తావించకుండా మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఆయన టీడీపీకి ఇప్పట్లో దగ్గరయ్యేందుకు ప్రయత్నించట్లేదని స్పష్టం అవుతోంది.