సుశాంత్ మరణం తర్వాత సినిమా రంగంలో నెపోటిజం గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది.చాలా మంది నెపోటిజం వలన తాము అవకాశాలు కోల్పోతున్నాం అంటూ గగ్గోలు పెట్టారు.
టాలెంట్ లేకున్నావారసత్వం తో స్టార్స్ గా చాలా మంది చెలామణి అవుతున్నారు అంటూ హడావిడి చేశారు.ఇక ఈ విషయంలో బాలీవుడ్ భామ పాయల్ ఘోష్ కూడా గొంతు కలిపింది.
బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉంటుందని కొత్తవాళ్లుకి అవకాశాలు అంత ఈజీగా దొరకవని వాఖ్యలు చేసింది.అయితే ఈ విషయాన్ని పట్టుకొని కొంత మంది ఆమె గతంలో ఎన్ఠీఆర్ చేసిన వాఖ్యలని గుర్తుచేస్తూ ట్రోల్ చేశారు.
నెపోటిజం వల్ల వచ్చిన ఎన్టీఆర్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ పాయల్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.పాయల్ ఘోష్ వీటిపై స్పందించి ఎన్ఠీఆర్ మీద నెగిటివ్ కామెంట్లు చేసిన వారి మీద తీవ్ర స్థాయిలో మండిపడింది.
తారక్ కూడా నెపోటిజం ప్రొడక్టే కదా నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావంటూ కంటిన్యూస్ గా మెసేజెస్ చేస్తున్నారు.మీకు కచ్చితంగా ఆయన గురించి ఏమీ తెలిసి ఉండదు.
అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు.సో మీరంతా మూసుకుని ఉండండి అంటూ ట్వీట్ చేసింది.
దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ తమ అభిమాన హీరోకి మద్దతుగా నిలుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఆమె అన్నట్లు ఎన్ఠీఆర్ వారసుడుగా వచ్చిన కూడా అతనికి ఆరంభంలో ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదని విషయం చాలా మందికి తెలుసు.
కేవలం అతని సామర్ధ్యంతోనే ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగాడు.