ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.హరికృష్ణ మాత్రమే కాకుండా నందమూరి కుటుంబానికి చెందిన మరొకరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్ లలో అందరి స్పీచ్ లు అంతా అయిపోయిన తర్వాత అభిమానులకు ప్రతి ఒక్కరు ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్లాలని కచ్చితంగా సందేశం ఇచ్చి గాని తాను ఇంటికి వెళ్ళడు.
అదేరీతిలో తన సినిమా ప్రారంభంలో కూడా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మెసేజ్ ఇవ్వటం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి తరుణంలో తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వార్షికోత్సవం కార్యక్రమంలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కొత్త పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు విషయంలో ప్రజలను చైతన్య పరుస్తూ జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనటం జరిగింది.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి సజ్జనార్ మరికొంత మంది పోలీసు ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల పై అదేవిధంగా డ్రైవింగ్ వంటి విషయాలపై వాహనదారులకు చైతన్యం కలిగించే రీతిలో పలు సూచనలు ఇస్తూ పోలీసు ఉన్నతాధికారులు ప్రసంగించారు.