టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.
ఇక మహేష్ బాబు ఈ సినిమా బిజీ లో ఉండగానే మరో రెండు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలిసిందే.రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఈ మధ్య తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా నుండి.
ఈ సినిమా అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని, వీ ఎఫ్ ఎక్స్, సీజిఐ వర్క్ ఎక్కువగా ఉంటుందని వినిపించగా ఈ సినిమాని ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో షూట్ చేస్తున్నారని.ఇప్పటికే రాజమౌళి లొకేషన్ పిక్స్ కూడా పరిశీలించినట్లు తెగ వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఇందులో మహేష్ బాబు చత్రపతి శివాజీ గా నటిస్తున్నాడని.సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది కూడా మొదలు కాదని బాగా పుకార్లు వినిపించగా.ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎటువంటి ప్రకటన లేకపోగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పుకారు తెగ వైరల్ గా మారింది.
అంతేకాకుండా గతంలో ఈ సినిమా విజయదశమిరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని అనుకున్నారు అన్న పుకార్లు వినిపించగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయనున్నట్లు కూడా తెగ పుకార్లు వచ్చాయి.