ప్రస్తుతం కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా మాధ్యమం వేదికగా చేసినటువంటి పనుల కారణంగా సమాజంలో పరువు, ప్రతిష్టలు ఉన్నటువంటి కొందరు ఇబ్బందులకు గురవుతున్నారు.తాజాగా ఓ మలయాళ సినీ పరిశ్రమకి చెందినటువంటి ఓ నటి ఫోటోలనీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ కి సృష్టించి ప్రచారం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే మలయాళంలో ఉప్పమ్ మూలకమ్ అనే షో ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైనటువంటి జూహీ రస్తోగి అందరికీ సుపరిచితమే.అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది.
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోలను తీసుకొని వాటిని నగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.దీంతో ఈ విషయంపై స్పందించిన టువంటి జూహీ రస్తోగి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.
ఇందులో భాగంగా తన ఫోటోలను అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
అంతేగాక సోషల్ మీడియాలో ఇలా మహిళల గురించి అసభ్యకరంగా పోస్టులు షేర్ చేయడం సరికాదని తమ ఇంట్లో కూడా మహిళలు ఉంటారని వారి గురించి కూడా ఒకసారి ఆలోచించాలని తెలిపింది.
అయితే ఒక పక్క పలు షోలలో నటిస్తున్నటువంటి జూహీ రస్తోగి సినిమాల్లో కూడా అవకాశాల కోసం తీవ్రంగానే శ్రమిస్తోంది.