టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఎన్టీఆర్.ప్రస్తుతం ఎన్టీఅర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెల్లబోతున్నాడు.ఈ సినిమా సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు చాలా మంది అగ్ర హీరోలు నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు.ప్రొడక్షన్ హౌస్ పెట్టి తన సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటు చిన్న హీరోలతో సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.
రామ్ చరణ్ తండ్రి కోసం నిర్మాతగా మారగా మహేష్ బాబు నిర్మాత అవతారం ఎత్తి తన సినిమాలతో పాటు తాజాగా అడవి శేష్ హీరోగా మేజర్ సినిమాని నిర్మిస్తున్నారు.నాని కూడా నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తుంది.తన తండ్రి, కొడుకు పేరు కలిసి వచ్చేలా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి దాని ద్వారా మినిమం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
దీని కోసం మొదటి సినిమా హీరోగా నేచురల్ స్టార్ నానిని కన్ఫర్మ్ చేసుకున్నాడు.ఇప్పటికే ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ లో నాని హీరోగా తెరకేక్కబోయే సినిమాకి దర్శకుడు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.త్వరలో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.ఇందులో ఎంత వాస్తవం అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.