టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు అభిమానులకు జపం.లైఫ్ లో ఒక్కసారి అయిన జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలి, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఫోటోలు దిగాలి అని లక్షలాదిమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్ కూడా తన అభిమానులను అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు.తన అభిమానికి కష్టం వచ్చింది అంటే వెంటనే స్పందిస్తూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కోమాలో ఉన్న తన అభిమాని జనార్ధన్తో, అతడి తల్లితో మాట్లాడాడు.అధైర్యపడకుండా దేవుడిని నమ్మండి అని జనార్ధన్ తల్లికి నచ్చజెప్పాడు ఎన్టీఆర్.త్వరలోనే అతడు కోలుకుని వస్తాడని భరోసా ఇచ్చాడు.అనంతరం కోమా లో ఉన్న జనార్ధన్ చెవి దగ్గర ఫోన్ పెట్టగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.నేను ఎన్టీఆర్ను మాట్లాడుతున్నాను, నువ్వు త్వరగా కోలుకుంటే మనం కలుద్దాం.
మేము అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.నిన్ను చూడాలని ఉంది.త్వరగా కోలుకుని వచ్చేయ్, నీకోసం ప్రార్థిస్తున్నాం.
నీకోసం నేనున్నాను, మన అభిమానులున్నారు.అందరూ నీ మంచి కోరుకుంటారు.
నువ్వు త్వరగా కోలుకుని వచ్చేసేయ్, కలుద్దాం.నీకేం అవదు అని మాట్లాడుతూ భరోసా ఇచ్చాడు.
తారక్ మాట్లాడుతుంటే కోమాలో ఉన్న జనార్ధన్ వేళ్లు కదిలిస్తున్నాడని అక్కడున్నవాళ్లు పేర్కొన్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది.
ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.