కేజీఎఫ్ సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను తన వైపు ఆకర్షించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.ప్రస్తుతం దర్శకుడు కేజీఎఫ్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే కెజీఎఫ్ సినిమాతో సౌత్ ఇండియన్ నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకొని క్యూ కట్టేశారు.ఈ వరుసలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా చేరిపోయాడు.
ఇదిలా ఉంటే ఈ దర్శకుడు తాజాగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.
ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కి అదిరిపోయే స్టొరీ లైన్ ఒకటి చెప్పాడని దానికి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
అన్నీ అనుకూలంగా జరిగితే వచ్చే ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్
.