ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివతో చేస్తుండగా 31వ సినిమా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత తారక్ 32వ సినిమా మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ తో చేస్తాడని తెలుస్తుంది.
మహానటి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కు సినిమా ఎనౌన్స్ చేశాడు.వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కు తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో దీపిక పదుకొనె, అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.
ఇక ప్రాజెక్ట్ K తర్వాత నాగ్ అశ్విన్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.తారక్ తో నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తాడు అన్న దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి.మహానటిని ఎంతో గొప్పగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఎన్.టి.ఆర్ తో కచ్చితంగా మైథలాజికల్, లేదా సోసియో ఫాంటసీ సినిమా చేస్తాడని అంటున్నారు.నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె.ఎన్.టి.ఆర్ 30,31 సినిమాల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. నాగ్ అశ్విన్ తో తారక్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్యరలోనే తెలుస్తాయి.