”రౌద్రం రణం రుధిరం” సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయినా ఇప్పటికి ఈ సినిమా గురించి అందరు చర్చించు కుంటున్నారు.
ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకుంటూ ఆస్కార్ కు కూడా నామినేట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.
కానీ ఇంత వరకు సినిమాను స్టార్ట్ చేయలేదు.ఏదొక కారణంగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం లేదు.
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడు.కొరటాల సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఒకవైపు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించిన చరణ్ మరో సినిమాను కూడా పూర్తి చేసాడు.కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు తన కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు.
అయితే కొరటాల శివ చాలా రోజుల వరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేయక పోవడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.ఆచార్య వంటి డిజాస్టర్ వచ్చిన కూడా కొరటాల మీద ఉన్న నమ్మకంతో తారక్ ఈయనకే అవకాశం ఇచ్చాడు.
మరి తాజాగా ఈ సినిమా షూట్ గురించి అప్డేట్ తెలుస్తుంది.ఈ సినిమా గురించి కొరటాల ఎలాంటి అధికారిక అప్డేట్ ఇవ్వకపోయినా ఈ సినిమాను నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ మాత్రం అప్పుడప్పుడు కొన్ని పిక్స్ తో ఈ సినిమా పనులు జరుగుతున్నాయంటూ క్లారిటీ ఇస్తూ వస్తుంది.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ స్టార్ట్ చేయబోతున్నారట.
ప్రెజెంట్ హైదరాబాద్ సిటీ అవుట్ స్కట్స్ లో భారీ పోర్ట్ సెట్ వేస్తున్నారని ఇక్కడే షూట్ జరగనుందని అంటున్నారు.మార్చిలో సుదీర్ఘ షెడ్యూల్ తో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత గోవాలో సెకండ్ షెడ్యూల్ జరుపు కుంటుందట.ఇక ఈ షెడ్యూల్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో షూట్ స్టార్ట్ అది ముగిసిన తర్వాత కొద్దీ గ్యాప్ తోనే వైజాగ్ లో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
మరి వీరు ప్లాన్ చేసినట్టు ఎటువంటి ఆటంకం లేకుండా షూట్ పూర్తి అవుతుందో లేదో చూడాలి.