యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని గమనిస్తే ఇప్పటివరకూ చేసినవన్ని స్ట్రేయిట్ సినిమాలే.ఒక్క సినిమా కుడా రిమేక్ చేయలేదు ఎన్టీఆర్.
అలాగని మహేష్ బాబులా రీమేక్ అస్సలు చేయను అని కూడా చెప్పలేదు.ఇప్పుడు ఒక తమిళ సినిమాను రిమేక్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అజిత్ – శ్రుతిహాసన్ జంటగా వచ్చిన సినిమా వేదాలం.గోపిచంద్ తో శౌర్యం, శంఖం వంటి చిత్రాలను తీసిన శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అజిత్ – శివ కాంబినేషన్ లో ఇంతకుముందు వీరమ్ వచ్చి మంచి విజయాన్ని సాధించింది.ఇక వేదాలం కూడా భారి విజయం వైపు దూసుకెళ్తోంది.
తమిళ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తమిళ సినిమాల ఒపెనింగ్ రికార్డులన్నిటిని బద్దలు కొట్టిన వేదాలం, ఇప్పటికే దాదాపు వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందట.
వేదాలం చూసిన ఎన్టీఆర్ కి అందులో ఉన్న భావోద్వేగాలు, ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంటు బాగా నచ్చిందట.
రిమేక్ చేస్తే బాగుంటుంది అని ఎన్టీఆర్ తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.ఇక ఎన్టీఆర్ కూడా రిమేక్ చేసేస్తే ఇక మిగిలేది మహేష్ ఒక్కడే.