తెలంగాణాలో పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి.గెలుపే ధ్యేయంగా ప్రచారం తో హోరెత్తిస్తున్నాయి.
రకరకాల హామీలతో జనాలను బుట్టలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఈ పోటీలో టీఆర్ఎస్ మంచి స్పీడ్ మీద ఉంది.
మొన్నటివరకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకపోవడంతో… ప్రచారం మీద దృష్టిపెట్టలేకపోయాయి.ఇప్పుడిప్పుడే మహా కూటమిలోని పార్టీలు ప్రచారం మీద ఫుల్ ఫోకస్ పెట్టాయి.
కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే… సోనియా గాంధీ సభతో తెలంగాణాలో మంచి ఊపువస్తుంది అని కలలు కంటోంది.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే….ఆ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్స్తో, తెలంగాణపై సత్తా చాటాలని ఆలోచిస్తోంది.తెలంగాణ అసెంబ్లీ పోరులో 13 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది .మహాకూటమిలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడిపి ప్రచార వేదికలను పంచుకోనుంది.ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రమణ, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డిలతో పాటూ మరికొంత మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ రెడీ చేశారు.
అయితే వీరే కాకుండా ఏపీ సిఎం చంద్రబాబు, బాలకృష్ణతో పాటూ లోకేష్ కూడా ప్రచారం చేసేందుకు షెడ్యూల్ తయారు చేశారు.
అయితే ప్రత్యర్థి టీఆర్ఎస్ దూకుడుకి కొంతమేర అడ్డుకట్ట వేయాలంటే… జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ తరపున ఎన్నికల ప్రచారానికి ఒప్పింహాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది.ఎలాగూ… కూకట్ పల్లి అసెంబ్లీ బరిలో నందమూరి సుహాసిని బరిలో ఉండడంతో సోదరి కోసం అయినా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తాడని … పనిలో పనిగా సమయం చూసుకుని తెలంగాణ అంతటా మహాకూటమి తరపున ప్రచారం చేయించేలా ఎన్టీఆర్ ని ఒప్పించాలని బాబు ఆలోచన చేస్తున్నాడు.జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా వర్క్లో బిజీగా ఉన్నారు.అయితే… టీడీపీ ప్రతిపాదనకు జూనియర్ ఒకే చెప్తారా లేదా అనే విషయం పై టీడీపీ అధినేతలో ఉత్కంఠ పెంచుతోంది.అందుకే జూనియర్ ను ఒప్పించే బాధ్యత బాలకృష్ణ పై బాబు పెట్టినట్టు తెలుస్తోంది.