యంగ్ టైగర్ జూనియర్ కు క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ వరుస సక్సెస్ లు సాధిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఈ మధ్య కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.వివాదాస్పద అంశాల గురించి స్పందించడానికి ఎన్టీఆర్ ఇష్టపడరనే సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైఎస్ జగన్ జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
అంబటి రాంబాబు తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను బోనియర్ ఎన్టీఆర్ అని అన్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలో ఈ తరహా కామెంట్లు వినిపించడం గమనార్హం.
అంబటి రాంబాబు మైలేజ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి కామెంట్లు చేశారని ప్రచారం జరగడం గమనార్హం.తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు జరగగా తెనాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడుతుంటే వైసీపీ నేతలు అడ్డుకున్నారు.వైసీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఈ విషయం జగన్ దృష్టికి వెళితే జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా సినిమాలకే పూర్తిస్థాయిలో పరిమితమవుతూ రాజకీయాల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.అలాంటి ఎన్టీఆర్ విషయంలో కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.