సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘స్పైడర్’ చిత్రం ఏ స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు మరియు తమిళంలో రూపొందిన ఆ చిత్రం రెండు భాషల్లో కూడా డిజాస్టర్ అయ్యింది.
దాంతో మహేష్బాబుకు తమిళం అచ్చిరాదు అంటూ తేలిపోయింది.ఈ కారణంగానే ఇతర స్టార్ హీరోలు తమిళ సినిమాపై నమ్మకం పెట్టుకోవడం లేదు.
తమిళ దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని అనుకోవడం లేదు.
తాజాగా ఎన్టీఆర్, అట్లీల కాంబినేషన్లో ఒక సినిమాను చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు అశ్వినీదత్ చేస్తున్నాడట.గత కొంత కాలంగా అశ్వినీదత్ బ్యానర్లో ఎన్టీఆర్ ఒక చిత్రం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
శక్తి ఫ్లాప్ మిగల్చడంతో ఎన్టీఆర్ మరో సినిమాను అశ్వినీదత్కు ఇవ్వాలని అనుకున్నాడు.అందుకే డేట్లు ఇచ్చాడు.అయితే అశ్వినీదత్ మాత్రం తమిళ దర్శకుడు అట్లీతో ఎన్టీఆర్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
తమిళంలో స్టార్ దర్శకుడిగా దూసుకు పోతున్న అట్లీ అక్కడ చేసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాయి.అందుకే ఆయనతో మాట్లాడి, భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ ఒక కథను అశ్వినీదత్ రెడీ చేయించాడు.అయితే ఎన్టీఆర్ మాత్రం అట్లీ దర్శకత్వంలో నటించేందుకు కాస్త టెన్షన్ పడుతున్నాడు.
అట్లీ దర్శకత్వంలో సినిమా అంటే మరో స్పైడర్ అవుతుందా అనే టెన్షన్ పడుతున్నారు.
అశ్వినీదత్ మాత్రం ఎన్టీఆర్ను ఒప్పించి అట్లీ దర్శకత్వంలో ఒక ద్వి భాష చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అట్లీ దర్శకత్వంలో తెలుగు సినిమా అంటూ మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
మరి ఇదైనా ఫైనల్ అయ్యేనా చూడాలి.