ఇండియన్ వైడ్ గా షేక్ చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.ఒక్కో రికార్డును చెరిపేసుకుంటూ వచ్చిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయినా కూడా ఇప్పటికి అందరి నోటా ఈ పేరు వినిపిస్తూనే ఉంది.
ఇటీవలే జపాన్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసారు.మరి అంతటా ఎలా రెస్పాన్స్ వచ్చిందో.
జపాన్ లో కూడా అంతే రెస్పాన్స్ అందుకుంది.
ఇక గత వారం మన ట్రిపుల్ ఆర్ సినిమా హాలీవుడ్ అవార్డుల్లో సందడి చేసిన విషయం తెలిసింది.
ఎంతో ప్రతిష్టాత్మక అవార్డులు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ అవార్డు అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఈ అవార్డు దక్కించు కోవడంతో ఈ సినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.
గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.
అగ్ర డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి.నటన పరంగా అదరగొట్టారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట స్పెషల్ షోలు పడుతూనే ఉన్నాయి.ఇక తాజాగా తెలుగులో మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో దేవి థియేటర్ లో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేస్తున్నారు.
జనవరి 20 నుండి ఈ థియేటర్ లో షో పడనుండగా ప్రెజెంట్ 5 రోజుల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.చూడాలి మరి 20 నుండి ఈ సినిమా రచ్చ ఎలా ఉండబోతుందో.