మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లు లేకుండా తన సినిమాలు ఏవో తను చేసుకుంటూ వెళ్తాడు.సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ కి టైం ఇచ్చే మహేష్ కి ఇండస్ట్రీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో మంచి స్నేహం ఉంది.
టాలీవుడ్ లో టాప్ హీరో లో ఒకడైన మహేష్ బాబు ఎటువంటి ఇగో లేకుండా పవన్ కళ్యాణ్ జల్సా , ఎన్టీఆర్ బాద్ షా చిత్రాలకు వాయిస్ ఓవర్ ని కూడా ఇచ్చాడు.
అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో ఉన్న మహేష్ బాబు మహర్షి సినిమా ని మే 9 వ తేదీన విడుదల కాబోతుంది.
ఇది మహేష్ బాబు కెరీర్ లో 25 వ చిత్రం కాబట్టి ప్రి రిలీజ్ ఫంక్షన్ ని భారీగా చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు టీం.మే 1న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరగనున్నా ఈ వేడుకకు గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అని ఆసక్తి నెలకొంది.అయితే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ప్రస్తుతం దీనిపైన సోషల్ మీడియా లో అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.మహేష్-ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడంతో అటు మహేష్ అభిమానులలో ఇటు ఎన్టీఆర్ అభిమానులలో పండుగ వాతావరణం కనపడింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా లో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.ఒకవేళ మహర్షి ప్రి రిలీజ్ ఈవెంట్ కి ఈ ఇద్దరు హీరో లు వస్తే వేదిక పైన ఈ ముగ్గురి ఒకేసారి చూడచ్చు అని అభిమానులు ఆశ పడుతున్నారు.