తెలంగాణ రాజకీయాల్లో నందమూరి వారసురాలిగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని ని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.అయితే ఆమెను ఇక్కడ పోటీకి దింపడం వెనుక పెద్ద స్కెచ్చే వేసాడు చంద్రబాబు.
అసలు ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్ ని రంగంలోకి దించబోతున్నారు అనే వార్తలు వినిపించాయి.అయితే అందుకు ఆయన ఒప్పుకోకపోవడం తో అనూహ్యంగా సుహాసిని పొలిటికల్ ఎంట్రీ జరిగిపోయింది.
నందమూరి వారసులను రంగంలోకి దింపడం ద్వారా నందమూరి అభిమానుల మద్దతు తో పాటు తెలంగాణ ఏపీలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది అని దీనికి తోడు నందమూరి హీరోలు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు టీడీపీ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బాబు భావించాడు.అంతే కాకుండా వారిని మెల్లిగా ఒప్పించి ఏపీ ఎన్నికల్లో కూడా… ప్రచారం చేయించుకోవాలని బాబు ఆలోచన.
అయితే అంతా అనుకున్నట్టుగానే కూకట్ పల్లిలో ప్రచారం చేసేందుకు ఎన్టీఆర్ .కళ్యాణ్ రామ్ రాబోతున్నారని … అదిగో ఇదిగో అంటూ టీడీపీ ప్రచారం చేయించింది.కానీ అదేమీ జరగలేదు.కానీ ఇప్పుడు వినిపిస్తున్నవార్తల ప్రకారం ఇప్పట్లో అసలు ఎన్టీఆర్ వచ్చే అవకాశం లేదని మళ్ళీ వార్తలు వస్తున్నాయి.అంతే కాదు తన అక్క సుహాసిని కోసం కళ్యాణ్ రామ్ కు ప్రచారంకు వెళ్లాలని ఉన్నా… ఎన్టీఆర్ వెళ్లనీయడం లేదని ఒక మీడియా వర్గం ప్రచారం చేస్తుంది.కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక మాట మీద ఉంటున్నారు.
ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నా, కళ్యాణ్ రామ్ మాత్రం అందరితోనూ మంచి సంబంధాలే కలిగి ఉన్నారు.కానీ ఎన్టీఆర్ మాట దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి.
టీడీపీ తరపున ప్రచారం చేసే విషయంలో తారక్ వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో… ప్రచారానికి కూడా కళ్యాణ్ రామ్ రాకపోవచ్చని సమాచారం.ఆడపడుచు కష్టపడుతుంటే ఇంట్లో కూర్చుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కళ్యాణ్ రామ్ భాధపడుతున్నాడట.ఇదే క్రమంలో ఎన్టీఆర్ మాట కాదనలేని పరిస్థితి.దీనితో ఆయన సుహాసిని మద్దతుగా తన సతీమణి స్వాతి ప్రచారానికి పంపించారు.కానీ అసలు ఈ నందమూరి బ్రదర్స్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనే విషయంలో ఆయన ఫ్యాన్స్ కే కాదు టీడీపీలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.బాబు అంటే అవకాశవాద రాజకీయానికి పెట్టింది పేరని.
అవసరం ఉన్నంతవరకు వాడుకుని ఆ తరువాత పక్కనపెట్టెయ్యడం అలవాటని గతంలోనూ ఎన్టీఆర్ విషయంలో ఇదే జరిగిందని, అందుకే ఆయన మాటలు నమ్మి మళ్ళీ రాజకీయ తప్పటడుగులు వేసేందుకు ఎన్టీఆర్ ఇష్టపడడంలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.