టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత కమర్షియల్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోల జాబితాలో ఎన్టీఆర్ పేరు ముందు వరుసలో వినిపిస్తుంది.
ఒక్క నందమూరి ఫ్యామిలీ బ్రాండ్ తప్ప ఎలాంటి సపోర్ట్ లేకుండా నటుడుగా ఎప్పటికప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ యూనివర్శల్ స్టార్ గా ఎన్టీఆర్ ఎదిగాడు.టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ప్రస్తుతం అతనిది మొదటి స్థానం అని చెప్పాలి.
ఇక కళ్యాణ్ రామ్ కూడా కమర్షియల్ హీరోగా, నిర్మాతగా టాలీవుడ్ లో మంచి ట్రాక్ రికార్డ్ లో దూసుకుపోతున్నాడు.ఎన్టీఆర్ రేంజ్ లో కాకపోయినా కళ్యాణ్ రామ్ కి కూడా మంచి ఇమేజ్ ఉంది.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇక నందమూరి ఫాన్స్ కి పూనకాలు వచ్చేయడం గ్యారీంటీ.
ఇప్పుడు అలాంటి ఓ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతుంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఉన్న ఎన్టీఆర్ తరువాత త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.ఇప్పటికే ప్రశాంత్ తో మైత్రీ బ్యానర్ ఒప్పందం కూడా చేసుకుంది.
ఇక ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ చెప్పిన స్టొరీ లైన్ కి నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో హీరో పాత్ర కూడా కీలకంగా ఉంటుందని సమాచారం.
ఈ నేపధ్యంలో ఆ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడంపై ఆసక్తిగానే ఉండటంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.