రాజధాని మంటల పై జేపీ సంచలన కామెంట్స్

మూడు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తుంది.అసలైతే భూమి ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పడంతోనే వారి ఆస్తులు తగల పెట్టించారు అని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తుంటే.

 Jp Comments On Tullur Incindent-TeluguStop.com

మరో పక్క ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా జగన్ ఇదంతా చేయించాడు అంటూ బాహాటంగానే విమర్శల యుద్దం ప్రకటించింది.ఇక దీనిపై విచారణకు ఆదేశించాలి అని స్వయంగా చంద్రబాబు కలక్టర్, మరియు డీ.జీ.పీ తో మాట్లాడారు.ఒక పక్క దర్యాప్తు జరుగుతున్న సమయంలో మరో పక్క లోక్‌సత్తా అధినేత జేపీ ఈ ఘటనా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ ఈ మంటలకు కారణం కులాలు కొట్లాటేనని, కుల రాజకీయాలు ఎక్కువై పోతూ ఉండడంతోనే ఇలా జరుగుతుంది అని చెబుతూనే ఆ రెండు కులాలు ఒకరి పై మరొకరి ఆధిపత్యం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన విమర్శించారు.

మరి ఎంత కాదనుకున్నా ఆ రెండు కులాలు ఏవనేది ఇప్పటికేమనకు అర్దం అయిపోయి ఉంటుంది కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube