తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఆసక్తిని రేకేత్తిస్తోంది.ఇప్పటివరకు రాజకీయనాయకులకు పట్టం కట్టిన పట్టభద్రులు పోటీలో ఉన్న జర్నలిస్టు అభ్యర్థులకు పట్టం కడతారేమోనన్న ప్రచారం జరుగుతోంది.
అయితే స్వతహాగా జర్నలిస్టులకు ప్రశ్నించేతత్వం ఉంటుంది.కాబట్టి వారు పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారనేది మెజారిటీ పట్టభద్రుల అభిప్రాయంగా తెలుస్తోంది.
అయితే అయితే పట్టభద్రుల మదిలో ఎవరు ఉన్నారనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.అయితే జర్నలిస్టులకు పట్టం కట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ప్రజాప్రతినిధుల కన్నా వారికి అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంటుంది. అంతే కాక ఎటువంటి ప్రశ్నలు సంధిస్తే ఎటువంటి సమాధానం వస్తుందనేది ఖచ్చితమైన అవగాహన ఉంటుంది.కాని పట్టభద్రులు వేరే సమీకరణాల లా ఆలోచిస్తే మరల యథాతథ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది.
అయితే ఈసారైనా పట్టభద్రులు ఇప్పటివరకు అవకాశం ఇచ్చిన వారికి మద్దతు తెలపక, కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడే ఓడిపోయిన వారికి వారు చేసే తప్పు ఏంటో తెలియడమే కాకుండా, వారు తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే అవకాశం ఉంది.లేకపోతే నాయకులు తమ తప్పులు తాము తెలుసుకునే అవకాశం లేకపోతే ఇక భవిష్యత్తులో నాయకులను అడ్డుకోవడం అనేది చాలా కష్టం.