పట్టభద్రులు ఎమ్మెల్సీలుగా జర్నలిస్టులకు పట్టం కట్టనున్నారా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఆసక్తిని రేకేత్తిస్తోంది.ఇప్పటివరకు రాజకీయనాయకులకు పట్టం కట్టిన పట్టభద్రులు పోటీలో ఉన్న జర్నలిస్టు అభ్యర్థులకు పట్టం కడతారేమోనన్న ప్రచారం జరుగుతోంది.

 Will  Journalists Selected As Mlc Candidates ?,journalists, Mlc Candidates, Tela-TeluguStop.com

అయితే స్వతహాగా జర్నలిస్టులకు ప్రశ్నించేతత్వం ఉంటుంది.కాబట్టి వారు పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారనేది మెజారిటీ పట్టభద్రుల అభిప్రాయంగా తెలుస్తోంది.

అయితే అయితే పట్టభద్రుల మదిలో ఎవరు ఉన్నారనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.అయితే జర్నలిస్టులకు పట్టం కట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ప్రజాప్రతినిధుల కన్నా వారికి అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంటుంది.
అంతే కాక ఎటువంటి ప్రశ్నలు సంధిస్తే ఎటువంటి సమాధానం వస్తుందనేది ఖచ్చితమైన అవగాహన ఉంటుంది.కాని పట్టభద్రులు వేరే సమీకరణాల లా ఆలోచిస్తే మరల యథాతథ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది.

అయితే ఈసారైనా పట్టభద్రులు ఇప్పటివరకు అవకాశం ఇచ్చిన వారికి మద్దతు తెలపక, కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడే ఓడిపోయిన వారికి వారు చేసే తప్పు ఏంటో తెలియడమే కాకుండా, వారు తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే అవకాశం ఉంది.లేకపోతే నాయకులు తమ తప్పులు తాము తెలుసుకునే అవకాశం లేకపోతే ఇక భవిష్యత్తులో నాయకులను అడ్డుకోవడం అనేది చాలా కష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube