వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ ఎవరు అనగానే మనందరికీ బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్ గుర్తొస్తుంటారు.వీరందరూ అగ్రరాజ్యం అమెరికాకు చెందినవారు కావడం గమనార్హం.
అయితే, వీరి వద్ద చాలా సంపద ఉందని మనం అందరం అనుకుంటూ ఉంటాం.వీరిని మించిన ఆస్తుపరులు భూస్వాములు ఉండబోరు అని అనుకుంటాం.
కానీ, వీరందరికంటే కూడా ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి మరొకరు ఉన్నారు తెలుసా.వారు ఎవరంటే.
జాన్ మెలోన్ అనే వ్యక్తి.అయితే, ఆయనకు ఇంత ఆస్తి, భూమి ఉన్నదన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద భూస్వామిగా జాన్ మెలోన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది.మెలోన్ మార్చి 7, 1941 న్యూయార్క్లో పుట్టారు.హాప్కిన్ పాఠశాలలో స్కూలింగ్ కంప్లీట్ చేసిన మెలోన్ ఎల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.అనంతరం జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు.
అనంతరం అందరిలా ఉద్యోగంలో జాయిన్ కాకుండా మెలోన్యే సొంతంగా ఓ మీడియా సంస్థను స్టార్ట్ చేశారు.‘లిబర్టీ’అనే మీడియాను స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు.
మెలోన్ 22 లక్షల ఎకరాల భూమి కలిగి ఉండటం గమనార్హం.లిబర్టీ మీడియా ఓనర్ అయిన జాన్ మెలోన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు.
ప్రజెంట్ ఈయన ఏజ్ 77 ఏళ్లు అయినా ఆయన ఇంకా యాక్టివ్గా ఉన్నారు.మీడియాను ఇంకా యాక్టివ్గా ఉంచుతూ, భూములను డీల్ చేస్తూనే ఉన్నాడు జాన్ మెలోన్.జాన్ మెలోన్ భూముల విలువ 9.22 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.మెలోన్ జర్మనీ దేశానికి చెందిన ఫిలాసఫర్ జార్జ్ హెగెల్ ‘ప్రాపర్టీ ఈజ్ ది ఫస్ట్ ఎంబోడియెంట్ ఆఫ్ ఫ్రీడమ్’ని ఫాలో అవుతారు.ఇకపోతే తాజాగా మెలోన్, ఆయన భార్య 42.5 మిలియన్ డాలర్లను కొలరాడో స్టేట్ యూనివర్సిటీకి దానంగా ఇచ్చారట.యానిమల్స్, హ్యూమన్స్ కోసం రీజనరేటివ్ మెడికల్ థెరపిస్ట్స్ కోసం అంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారట.