ఈ మధ్య కాలంలో హీరోలు కూడా తమని తాము మార్చుకుంటూ ఇతర హీరోల సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.గతంలో నెగిటివ్ రోల్స్ అంటే అస్సలు ఆసక్తి చూపించేవారు కాదు.
వాటి ప్రాధాన్యత తక్కువగా ఉంటుందనే అభిప్రాయం హీరోలుగా చేస్తున్నవారిలో ఉండేది.అయితే కొత్త దర్శకుల ఆలోచనలు మారాయి.
దాంతో కథలు రాసే విధానం కూడా మారింది.ఈ కారణంగా హీరోతో సమానంగా బలమైన విలనిజం ఉండే పాత్రలని దర్శకులు సృష్టిస్తున్నారు.
అలాగే సినిమా కూడా లాంగ్వేజ్ బారియర్స్ దాటుకుంటూ వెళ్ళిపోయింది.భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలని అన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు.
హీరోలకి కూడా అన్ని చోట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో దాంతో సినిమా మార్కెటింగ్ చేసుకుంటున్నారు.ఈ కారణంగా హీరోలు కూడా విలన్ గా నటించడానికి ఒకే చెప్పేస్తున్నారు.సౌత్ లో ఇప్పటికే ఇతర స్టార్ హీరోల సినిమాలలో ఇతర హీరోలు విలన్ లుగా నటిస్తున్నారు.ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆ ట్రెండ్ మొదలైంది.ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జాన్ అబ్రహం ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఓ విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న విలన్ గా జాన్ అబ్రహం రికార్డు సృష్టించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది.