అగ్ర రాజ్యం పెద్దన్న ఇలాఖాలో జరిగే అధ్యక్ష ఎన్నికలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇరు పార్టీలు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు.
నువ్వా నేనా అన్నట్టుగా ప్రచార పర్వాలు జోరందుకున్నాయి.ముఖ్యంగా ఇండో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇరు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఎన్నారైల ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలలో పార్టీలు బిజీ బిజీ అయ్యిపోయాయి.ఈ క్రమంలోనే
డెమోక్రటిక్ పార్టీ భారతీయ ఓటర్ల కోసం 14 బాషలలో డిజిటల్ ప్రకటనలు విడుదల చేశారు.
బిడెన్ మాత్రమే భారతీయ ఎన్నారై లకు అలాగే భారత్ తో మంచి సంభంధాలు కలిగిఉంటారని, ఎన్నారైలకు పూర్తిగా న్యాయం చేయగలిగేది బిడెన్ మాత్రమే నని ప్రచారం చేస్తున్నారు.ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారీస్ భారతీయులకి చెందిన వ్యక్తిగా చూపిస్తూ ఆమెకు మీ మద్దతు ఉండాలని డిజిటల్ రూపంలో ప్రచారాలు చేస్తున్నారు.ఇదిలాఉంటే
బిడెన్ ప్రచార వ్యుహకర్తలలో ఒకరైన జైన్ భుటోరియా మాట్లాడుతూ టెక్నాలజీ ని ఉపయోగించి భారతీయ ఓటర్ల కు ఎలా దగ్గర అవ్వాలి అనే విషయంలో సక్సస్ అయ్యామని అన్నారు.ఎన్నికలకు ఎలా సిద్దమవ్వాలి, ఎలాంటి పద్దతులు పాటించాలి అనే విషయంపై అవగాహన కలిపిస్తున్నమని అన్నారు.
బాలీవుడ్ హిట్ పాటలను రీమిక్స్ చేస్తూ బిడెన్ కి ఓటు వేయండి అనేట్టుగా సిద్డం చేస్తున్నారు.వీటిని ప్రదర్శించిన సమయంలో ఎన్నారైల నుంచీ మంచి స్పందన వస్తోందని తెలిపారు.