అమెరికాలో నిన్న, మొన్నటి వరకూ అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ నుంచీ ఎవరు ఫైనల్ అవుతారోనని సందిగ్ధత నెలకొనగా జో బిడెన్ అధ్యక్ష అభ్యర్దని ప్రకటించారు.ఇక నవంబర్ లో పోరు కేవలం డెమోక్రటిక్ పార్టీ నుంచీ బిడెన్ అలాగే రిపబ్లికన్ పార్టీ నుంచీ ట్రంప్ మధ్యనేనని తేలిపోయింది.
ఈ హోరా హోరీ పోరులో గెలుపు ఎవరిదనేది ప్రజలు త్వరలో నిర్ణయించనున్నారు.ఇదిలాఉంటే డెమోక్రటిక్ పార్టీ నుంచీ బిడెన్ అధ్యక్షుడిగా గెలుపొందిదే ఉపాధ్యక్ష పదవి ఎవరికీ దక్కేను అనే ఆసక్తి కరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
బిడెన్ అధ్యక్షుడు అయితే ఉపాధ్యక్షులు ఎవరు అనే విషయంపైనే ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారట.అంతేకాదు బిడెన్ సైతం ఈ పదవికి ఎవరు అర్హులు అనే కోణంలో ఆలోచన చేస్తున్నారని అయితే ఇప్పటికే కొందరిని పరిశీలనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తప్పకుండా ఉపాధ్యక్ష పదవిలోకి ఓ మహిళా నేతని బిడెన్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారట.అంతేకాదు నల్లజాతీయులపై జరుగుతున్న హింసలని అరికట్టాలంటే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్షురాలిగా తీసుకోవాలని బిడెన్ పై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు.అయితే
బిడెన్ తాజాగా ఓ సమావేశంలో మిచిగాన్ గవర్నర్ ని వ్యక్తిగత సమావేశంలో కలవడంతో నల్ల జాతి మహిళని అభ్యర్ధిగా ఎన్నుకోవడంలేదని క్లారిటీ వచ్చేసింది.మరి బిడెన్ ఎవరిని ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయనున్నారు అంటే కొందరి పేర్లని పరిశీలనలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది.వారిలో భారత సంతతికి చెందిన కమలా హారీస్ , సుసాన్ రైస్ , ఎలిజిబెత్ వారెన్, గ్రెట్చెన్ విట్మర్, కరెన్ బాస్, మాగి హాసన్, గినా రైమాండో, మిచెల్ లుజన్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయట.అయితే భారత సంతతకి చెందిన కమలా హారీస్ పేరు ఉండటంతో ఆమెకి ఈ పదవి దక్కాలని భారత సంతతకి అమెరికన్స్ పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.