ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది.కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి ప్రస్తుతం కండల వీరుడు బెయిల్ పై రిలీజ్ అయ్యాడు.
అయితే ఈ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు కు హాజరు కావాల్సిన సల్మాన్ విచారణ కు హాజరు కాకపోవడం తో విసిగిన కోర్టు వార్నింగ్ ఇచ్చింది.ఈ సారి కానీ విచారణ సమయంలో కోర్టుకు హాజరు కాకపోతే తనకు ఇచ్చిన బెయిల్ ని క్యాన్సిల్ చేస్తామని కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
బాలీవుడ్ లో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఒకపక్క సినిమాలతో పాటు వివాదాలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.ఎప్పుడో 20 ఎల్లా కింద కృష్ణ జింకల వేట కు సంబందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఇప్పటికే ఆ కేసు నుంచి బయటపడలేక పోతున్నాడు.
హిట్ అండ్ రాం కేసులో నిర్దోషిగా బయటపడిన ఈ కండల వీరుడు కృష్ణ జింకల వేట కేసు నుంచి మాత్రం బయటకు రాలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికి ఈ కేసు విషయంలో కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు.
20 ఏళ్ళ క్రితం జరిగిన ఈ కేసులో అప్పుడు దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ రెండ్రోజులు జైల్లో కూడా ఉన్నాడు.ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఈయన ఇప్పుడు కోర్టుకు రాకుండా సినిమాల షూటింగ్స్ చేసుకుంటున్నాడు.దాంతో కోర్ట్ సీరియస్ అయి సల్లు భాయ్ కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చింది.తదుపరి విచారణకు ఒకవేళ సల్మాన్ కానీ రాకపోతే మాత్రం ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపిస్తామని కోర్టు స్ఫష్టం చేసింది.
అలానే ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది
.