విద్యావ్యవస్థ చిన్నా బిన్నం అయ్యింది.చిన్న పిల్లల నుండి పీజీ విద్యార్థుల వరకు అంతా కూడా కరోనా కారణంగా చాలా నష్టపోతున్నారు.
ఇక ప్రభుత్వాలు మరియు యూనివర్శిటీలు ప్రస్తుతం జట్టు పీక్కుంటున్నాయి.అసలు ఏం చేయాలి పరీక్షలు నిర్వహించడం వీలు పడటం లేదు, నిర్వహించిన పరీక్ష పేపర్లను కరెక్షన్ చేసేందుకు వీలు లేకుండా ఉంది.
దాంతో విద్యార్థుల కొత్త అడ్మీషన్స్ పరిస్థితి ఏంటీ కొత్తగా ఎంట్రెన్స్ టెస్టులు ఎలా నిర్వహించాలి అనుకుంటున్నారు.
ఈ సమయంలో జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంజనీరింగ్ విద్యార్థుల తదుపరి సెమిస్టర్ విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు పుకార్లకు చెక్ పెట్టింది.ఎవరైతే సెమిస్టర్ పరీక్షలకు హాజరు అయ్యారో వారిని తదుపరి సెమిస్టర్కు అనుమతించబోతున్నారు.
పరీక్ష ఫలితాలు ఇతరత్ర ఏమీ లేకుండానే నేరుగా తదుపరి సెమిస్టర్కు ప్రమోట్ అయినట్లుగా ప్రకటించారు.పరిస్థితి సర్దుమణిగిన తర్వాత ఏం చేయాలనే విషయమై ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చింది.
ఓయూ కూడా అదే విధానంలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది.