ఈరోజు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారి 19వ వర్ధంతి.ఈనాడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఎప్పటికీ తెలుగువారి గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిపోతారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయితే అందరూ ఆ పెద్దాయనకు నివాళులు ఆర్పిస్తున్న సంధర్బంలోనే భాగంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం అయాన ఘాట్ వద్దకు ఉదయాన్నే చేరుకుని కుటుంబ సమేతంగా నివాళులు అర్పించారు.ఇక ఆ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాను జీవించి ఉన్నంత కాలఓ ఎన్టీఆర్ ఆశయాల కోసం పాటు పడుతూనే ఉంటానని మరోసారి ప్రతిజ్ఞ చేసాడు అంతేకాకుండా తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చిన జూనియర్ తాను సినిమాలలో నటిస్తూనే ఎదో ఒకరోజున రాజకీయాలలోకి వస్తానని సంకేతాలు ఇవ్వడానికి మరోసారి తన తాత సమాధిని తన భవిష్యత్ ఆలోచనలకు వేదికగా మార్చుకుని తాను నందమూరి కుటుంబానికి ఏ మాత్రం దూరం కాలేదు అని మరోసారి సంకేతాలు ఇచ్చాడు.ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీ తరపున పనిచేయడానికి ఎన్టీఆర్ కు అవకాశం ఉంటుందా? అనేది పెద్ద సందేహం.బాబు అనంతరం పార్టీ పగ్గాలను సొంతం చేసుకోవడానికి లోకేష్ రెడీ అయిపోతున్నాడు.మరి ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటో, ఆయనకు అండగా ఎవరు ఉంటారో అన్న ప్రశ్న మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది.