సమాజం చెడిపోయిందని బాధపడే కంటే ఆ సమాజాన్ని మనుషులు అనే రెండు కాళ్ల జీవులు చెడగొడుతున్నారని భావించడం నిజం.ఎందుకంటే మనిషి తప్పు చేయందే సోసైటీ చెడిపోదు.
ముఖ్యంగా ఎక్కడైనా ఒక చెడు చోటు చేసుకుంటుందని అనుకుంటే అక్కడున్న వ్యవస్దలో లోపం ఉంటే గానీ ఇలాంటి నీచమైన పనులకు అస్కారం దొరకదు.
ఇక సర్వతికి నిలయమైన విద్యాలయాల్లో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్న విషయాలు తరచుగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గ్వాలియర్ యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది.
ఈ విషయంలో ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.
ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లోని జీవాజీ యూనివర్సిటీలో పనిచేసే ఐదుగురు తాత్కాలిక సిబ్బంది ఇలాంటి నీచమైన పనికి పాల్పడటం చూస్తుంటే ఇక్కడున్న నిర్వహణ లోపం సృష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.