వ్యాపారిని పట్టిస్తే లక్ష రూపాయలు బహుమతి...

హనీ ట్రాక్ పేరుతో డబ్బు ఉన్న వాళ్లకి అమ్మాయిలను ఎరగా వేసి తీయని గొంతుతో భారీగా డబ్బులు కాజేస్తున్న ముఠాలు ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కువైపోయి.ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇలాంటి హనీ ట్రాప్ లు ఎక్కువగా జరుగుతున్నాయి.

 Jitu Soni One Lakh Announced-TeluguStop.com

ఇలాంటి కేసులో ప్రధాన సూత్రదారిగా ఉన్న ఓ వ్యాపార వేత్తను పట్టుకునేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రివార్డులు ప్రకటించింది.మధ్యప్రదేశ్ లో ఇండోర్ కి చెందిన జితేంద్ర సోనీ అనే వ్యక్తి సాయంకాలం పేపర్ నడుపుతూ బయట ప్రపంచానికి జర్నలిస్ట్ ఫోజులు ఇస్తున్నాడు.

అయితే ఇతని ప్రధాన వృత్తి మాత్రం బడా బాబులను రాజకీయ నాయకులు ట్రాప్ చేస్తూ వారికి మహిళలను ఎరవేసి డబ్బులు గుంజడం, డాన్స్ బార్ లు, హోటల్స్ నిర్వహిస్తూ వాటి ద్వారా అసాంఘిక కార్యకలాపాలకి పాలడటం చేస్తున్నాడు.

అలాగే మహిళల అక్రమ రవాణా చేయడం, దోపిడీలు చేయడం, ప్రముఖ వ్యక్తులు బెదిరించి డబ్బులు వసూలు చేయడం చేస్తూ ఉన్నాడు.

జీతూ పై అయిదు కేసులు పాటు ఇలాంటి కేసులు మొత్తం 43 వరకు వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి.తాజాగా హనీ ట్రాప్ కేసులు ఇతర ప్రధాన సూత్రధారిగా పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు.

అయితే అతన్ని పట్టుకునే లోపే పరార్ అయిపోయాడు.దీంతో అతని ఆస్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇతనిపై రివార్డు ప్రకటించింది.

ఇతన్ని గుర్తించి పట్టించిన వారికి లక్ష రూపాయలు వరకు బహుమతిగా ఇస్తామని తెలియజేసారు.నిజానికి ఎక్కువగా నక్సల్స్, అత్యంత ప్రమాదకరమైన హంతకులు విషయం మాత్రమే పోలీసులు నజరానాలు ప్రకటిస్తుంటారు.

అయితే జితేంద్ర సోనీ మాత్రం అంతకంటే ప్రమాదకరమని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube