రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అద్భుతమైన ఆఫర్లను ఇస్తూ తక్కువ సమయంలోనే ఎంతోమంది యూజర్లను సంపాదించుకున్న నెంబర్ వన్ టెలికం సంస్థ గా మార్కెట్లో దూసుకుపోతోంది.అయితే ప్రస్తుతం మరికొన్ని సరికొత్త ప్లాన్లతో అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ప్రయత్నం జియో సంస్థ చేస్తోంది.
అందుకోసమే ఇటీవల సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ ను ఈ కంపెనీ తీసుకొచ్చింది.జియో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
దేశంలో 40 కోట్ల మంది యూజర్లతో దూసుకుపోతున్న ఈ జియో కంపెనీ పోస్ట్ పెయిడ్ ప్లేస్ ప్లాన్ ధర రూ.399 నుంచి ప్రారంభించి గరిష్టంగా1,499 రూపాయల వరకు ఉంది.జియో తన పోస్ట్ పెయిడ్ ప్లాన్ లతోపాటు ఇతర టెలికం సర్వీసులను కూడా ఉచితంగా అందించడమే ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత.దీని ద్వారా జియో యూజర్లకు అద్భుతమైన అవకాశం కల్పించడంతో పాటు మరికొంతమంది యూజర్లు పెరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా జియో కస్టమర్ యూజర్లకు తన పోస్ట్ పెయిడ్ ప్లాన్ లతోపాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఛానెల్లను ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఎటువంటి చెల్లింపు లేకుండా ఉచితంగా కల్పిస్తుంది.ఇది మాత్రమే కాకుండా 300G.
B హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.ఓకే రోజే 300 జీబీ నెట్ అయిపోయిన తర్వాత యూజర్లు కేవలం పది రూపాయలు చెల్లించి ఒక జిబి డేటా ను ఉచితంగా పొందవచ్చు.
నెలసరి ప్లాన్లు గడువులోపు మీ డేటా అయిపోకపోతే ఆ డేటాను తిరిగి తరువాత నెలలో ఉపయోగించుకునే అవకాశం కూడా జియో కస్టమర్ లకు కల్పిస్తోంది.ఇకపోతే అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్ లను ఇది వరకే ప్రతి ఒక్క కస్టమర్ పొందుతున్నాడు.
కాకపోతే కొత్తగా ఈ ప్లాన్ ఎంచుకునేవారు జియో ప్రైమ్ కోసం 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.దీని ద్వారా ఇతర దేశాలకు కూడా అపరిమిత కాల్స్ చేయొచ్చు.