రిలియన్స్ జియో.ఎన్ని బంపర్ ఆఫర్లు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ జియో వచ్చాకనే ఇండియా డిజిటల్ ఇండియా అయ్యిందని నిర్మొహమాటంగా చెప్పచ్చు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఎప్పుడులనే ఇప్పుడు కూడా జియో అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది.
అది ఏంటంటే? జియోఫై 4జీ వైర్లెస్ హాట్స్పాట్ కొనుగోలుపై ఐదు నెలల వరకు ఉచిత 4G డేటాతో పాటు జియో టు జియో ఉచిత కాల్స్ అందించనున్నట్లు ప్రకటించింది.ప్రస్తుతం జియోఫై హాట్స్పాట్ ధర రూ.1,999 కాగా దీన్ని కొనుగోలు చెయ్యడంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం ఆఫర్ పొందాలంటే జియోఫై కోసం ఏదైనా ఒక కనెక్షన్ ప్లాన్లని రీఛార్జ్ చేసుకోవాలి.
ప్రతి నెల 94 రూపాయిలు చెప్పున ఈఎంఐ చెల్లించి అయినా ఈ జియోఫైని కొనుగోలు చేయొచ్చు.అయితే ప్రస్తుతం ఈ జియోఫై కస్టమర్ల కోసం మూడు ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి.రూ.199 రీఛార్జ్తో ప్రతిరోజు 1.5జీబీ డేటా, రూ.249 రీఛార్జ్తో ప్రతిరోజు 2 జీబీ డేటా, మూడో ఆఫర్ రూ.349 రీఛార్జ్తో రోజువారీ డేటా 3జీబీ పొందేలా ఈ ప్లాన్స్ ఉన్నాయ్.ఇంకా ఈ ప్లాన్స్ ఆఫర్ల వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది.
మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ జియో ఆఫర్ ని ఉపయోగించండి.