దేశంలో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.డిజిటిల్ ఇండియాను అందరికీ అందించే దిశగా ముఖేష్ అంబాని ప్రవేశపెట్టిన జియో ఇప్పుడు యావత్ దేశంలో వినియోగించబడుతోంది.
ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తూ అతి తక్కువ ధరలకే వినియోగదారులకు 4జీ అందిస్తోన్న నెట్వర్క్గా జియో పెను సంచలనం సృష్టించింది.ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జియో ఇప్పుడు మరో కొత్త ఆఫర్తో మనముందుకు వచ్చింది.
2020 నూతన సంవత్సరం కానుకగా జియో తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్లో రూ.2020లతో రిచార్జ్ చేయించుకుంటే పూర్తిగా ఏడాదిపాటు అన్ని సర్వీసులు ఉచితంగా పొందగలరు.జియో టు జియో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియో నుండి ఇతర నెట్వర్క్ మొబైల్స్కు 12000 నిమిషాలు, ఉచిత ఎస్ఎంఎస్లు మరియు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తోంది.
అటు ఈ ఆఫర్ను కొనుగోలు చేసిన వారికి జియోఫోన్ను ఉచితంగా అందిస్తోంది.దీనిలో రోజుకు 0.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలను అందిస్తోంది.డిసెంబర్ 24న ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నట్లు జియో కంపెనీ ప్రకటించింది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజుల పాటు ఉంటుందని జియో ఒక ప్రకటనలో తెలిపింది.