ఈమద్య కాలంలో హీరోలు విలన్ వేశాలు వేయడం చాలా కామన్ అయ్యింది.విలన్ వేశాలు వేసి, నటుడిగా గుర్తింపు దక్కించుకునేందుకు యంగ్ హీరోలు సైతం ఉబలాట పడుతున్నారు.
అయితే మంచి పాత్ర అయితేనే విలన్గా నటించేందుకు ముందుకు వస్తున్నారు.రానా ‘బాహుబలి’ చిత్రం కోసం విలన్గా మారిన విషయం తెల్సిందే.
ఇంకా పలువురు చిన్న హీరోలు విలన్స్గా మారారు.తాజాగా వరుణ్ తేజ్ను కూడా విలన్గా మార్చేందుకు దిల్రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు తమిళ సూపర్ హిట్ మూవీ ‘జకర్తాండ’ రీమేక్ రైట్స్ను కొనుగోలు చేయడం జరిగిందట.ఆ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సిద్దార్థ హీరోగా నటించగా, బాబీ సింహా విలన్ పాత్రలో నటించాడు.విలన్గా నటించిన బాబీ సింహాకు అవార్డులు దక్కాయి.అద్బుతమైన విలనిజంతో మెప్పించాడు.విలన్ పాత్ర అయినా కూడా హీరో స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది.
అందుకే ఈ విలన్ పాత్రను మెగా హీరోతో చేయించాలని దిల్రాజు భావిస్తున్నాడు.
హీరో పాత్ర కోసం ఒక ప్రముఖ హీరోను సంప్రదించిన దిల్రాజు విలన్ పాత్రకు వరుణ్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.వరుణ్ కు కూడా విభిన్నమైన పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం.అందుకే ఈ రీమేక్లో విలన్ పాత్రకు ఓకే చెప్పే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో మొదటిగా ‘అంతరిక్షం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.
ఇక వెంకటేష్తో కలిసి నటిస్తున్న ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.