అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్.జాన్వికపూర్ ఒక్క సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.శ్రీదేవి తన కూతుళ్ళను నటిగా చూడాలన్నా కోరిక తీరకుండానే మృతి చెందిన సంగతి తెలిసిందే.
కానీ తన కోరిక పూర్తిగా తీరక ముందే అనంతలోకాలకు వెళ్ళిపోయింది.ఇటీవలే కొన్ని ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.తనని పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి తనను బాగా ప్రేమించాలని, చూసుకోవాలని తెలిపింది.తను మంచి వ్యక్తి గా ప్రతిభావంతుడై ఉండాలని తెలిపింది.తను చేసుకోబోయే వ్యక్తి నుంచి తనకు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలని, తను చేసే వృత్తిని అతడు ఇష్టంగా భావించాలని ఆమె చెప్పుకొచ్చింది.అంతేకాదు అందరితో గౌరవంగా ఉండాలని, అందరిలో కలిసికట్టుగా ఉండాలని జాన్వీకపూర్ ను చేసుకోబోయే వ్యక్తి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.కాగా జాన్వీ కపూర్ కు ఇష్టమైన ప్రదేశం ఇటలీ అని… తన పెళ్లి అక్కడే చేసుకుంటాను అని కొన్ని విషయాలను అప్పట్లో చెప్పింది.అయితే ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులకే ఆమె ఇటలీ అనే విషయాన్నీ మార్చేసింది.
తన తల్లి శ్రీదేవికి ఇష్టమైన స్థలం తిరుపతి అని.తను చేసిన సినిమాలను విడుదలకు ముందు తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేదని ఆమె చెప్పింది.అమ్మకు ఎంతో ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి.అమ్మ కోసం ఆమె తన పెళ్లిని తిరుపతిలో చేసుకుంటానని జాన్వీ కపూర్ తెలిపింది.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించినా ఆమె ఇటీవల ఓటిటిలో విడుదల అయినా గుంజన్ సక్సేనా చిత్రం పెద్దగా హిట్ అవ్వలేదు.