ప్రముఖ దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ త్వరలో తెలుగులో తెరంగేట్రం చేయనుందా.? అంటే నిజమే అనాల్సి వస్తుంది అనుకుంట.గతంలో తన కుమార్తెను మంచి ప్రాజెక్టు కుదిరితే తెలుగులోనే పరిచయం చేయాలని శ్రీదేవి భావించిందట.రామ్ చరణ్ తో జతగా డెబ్యూ ఇవ్వనుంది అనే వార్తకూడా అప్పట్లో హల్చల్ చేసింది.
జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, ఝాన్వి జంటగా నటించనున్నారని మెగా అభిమానులు సంబర పడ్డారు.కానీ అది ఆశగానే మిగిలిపోయింది.
ఇప్పుడు ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం గురించి అందరికి తెలిసిందే.ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది.ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్లు ఎవరన్నది అధికారికంగా వెలువడలేదు.ఒక హీరోయిన్ కీర్తి సురేష్ అనే పేరు వినిపిస్తుంది.
ఇప్పుడు కొత్తగా ఝాన్వి పేరు కూడా తెరపైకి వచ్చింది.ఈ కాంబినేషన్ చిత్రంలో నటిస్తే.
టాలీవుడ్లో మంచి ఎంట్రీ అవుతుందని జాన్వి తండ్రి బోనీకపూర్ భావిస్తున్నారట.అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శ్రీదేవిని ఎంతగానో అభిమానించిన తెలుగు ప్రేక్షకులు ఆమె కుమార్తెను కూడా తెలుగు సినిమాలలో చూడాలని కోరుకుంటున్నారు.
జాన్వి నటించిన తొలిచిత్రం దఢక్ బాలీవుడ్లో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ చిత్రం విజయవంతమవుతుందని చిత్రబృందం ఆశించినప్పటికీ ఇంత భారీ విజయం సాధిస్తుందని వారు కూడా ఊహించలేదు.దీంతో జాన్విలో ఉత్సాహం రెట్టింపయ్యింది.
వెంటనే హిందీలోనే రెండో చిత్రం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలుగులో ఎంట్రీపై ఎలా స్పందిస్తారో?
.