లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలు వారు మెమోరీస్ అన్ని కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నారు.అలాగే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.
సినిమాల విశేషాలు, ఇంట్లో కాలక్షేపం కోసం ఏం చేస్తున్నారు అనే విషయాలని పంచుకుంటున్నారు.ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ కూడా షూటింగ్ లు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటూ తన తల్లితో ఉన్న జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకొని వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
తను చిన్న వయసులో అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న వీడియో మొదలు ఇప్పటివరకు దిగిన ఫొటోలు, వీడియోలు అన్నింటినీ ఒకే దగ్గర చేర్చింది.ఈ దృశ్య మాలికకు తను వాయిస్ ఓవర్ అందించింది.
ఈ వీడియోలో జాన్వీ తన తల్లి శ్రీదేవీ పక్కన అమ్మకూచిలా కనిపిస్తుంటే, తండ్రి బోనీ కపూర్ దగ్గర గారాలు పోతోంది.ఇక చెల్లి ఖుషీ కపూర్తో కుప్పిగంతులేస్తోంది.
అల్లరి పిల్లగా అలరిస్తోంది.ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
బాల్యంలోనైనా, ఇప్పటికైనా డ్యాన్స్ను విడవనంటోంది.ఇక ఈ వీడియో జాన్వీ కపూర్ ఎవరు? అన్న ప్రశ్నతో ప్రారంభం అవుతుంది.మళ్లీ తనే ఫ్లాష్ బ్యాక్కు వెళ్లి నాలో అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఉన్నారు.నేను ఒక్కో పరిస్థితుల్లో ఒక్కోలా మారిపోతాను.దీన్ని నా స్నేహితులు ఊసరవెల్లి అంటారు.నేను బిజీగా ఉంటాను, ప్రయాణాలు చేస్తాను.
కాబట్టి నేను ఆశించినంతగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం లేదు.నాన్న ఒంటరిగా ఉన్నాడు.
ఆయనకు నేనింకా ఎక్కువ సమయం కేటాయించాలి.కానీ ఇప్పుడున్న లాక్డౌన్ వల్ల అది సాధ్యం అవట్లేదు.
మీరే మూడో వ్యక్తిగా మారి మీ జీవితాల్ని తరచి చూసుకోండి.నాకు నేను ఎక్కువ సమయం కేటాయించుకోవడం వల్ల మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాను.
కాబట్టి అందరూ పాజిటివ్గా ఉండండి.ఇంట్లో కుటుంబంతో కలిసి ఉండటాన్ని అదృష్టంగా భావించండి.
మీరు బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోకే అడుగులు వేయండి అంటూ వీడియోను ముగించింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.